పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రికి కరోనా పాజిటివ్

పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి అమిత్ మిత్రా సోమవారం కరోనాతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. ఐసోలేటెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆయనకు చికిత్సను అందిస్తున్నారు.

'కరోనా కారణంగా మాజీ మంత్రి మిత్ర ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని పీటీఐకి ఆసుపత్రిలోని ఓ అధికారి తెలిపారు.

West Bengal
Corona Virus

More Telugu News